Switch to English

రైళ్లు, విమానాలు ఇప్పట్లో లేనట్టే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

భారత్ లో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రావడంలేదు. నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా.. ప్రతిరోజూ పాజిటివ్ కేసుల ఇంకా వెలుగు చూస్తేనే ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలో 15,712 కేసులు నిర్ధారణ కాగా, 507 మంది మృత్యువాతపడ్డారు. పరిస్థితి చూస్తుంటే ఈ వైరస్ ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియడంలేదు. ఒకవేళ కేసుల సంఖ్య తగ్గి, మే 3వ తేదీతో లాక్ డౌన్ ఎత్తివేసినా.. విమానాలు, రైళ్లను నడిపే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.

రైలు, విమాన ప్రయాణాల్లో వ్యక్తిగత దూరం పాటించే అవకాశం లేనందున.. వాటికి అనుమతిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా రైళ్లు, విమానాలపై ఆంక్షలు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.

నిజానికి తొలి విడత లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు ప్రకటించగా.. భారతీయ రైల్వేతోపాటు విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుంచి ప్రయాణాలకు టికెట్లు విక్రయించాయి. కానీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగించడంతో ఆయా టికెట్ల సొమ్మును వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా.. మళ్లీ మే 4వ తేదీ నుంచి టికెట్లు విక్రయించాలని ఆయా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కేంద్రం వెంటనే రంగంలోకి దిగి.. అప్పుడే ఎలాంటి టికెట్లూ విక్రయించొద్దని వాటికి ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బుకింగులు ప్రారంభించొద్దని స్పష్టంచేసింది. దీంతో మే 3 తర్వాత సైతం రైళ్లు, విమాన ప్రయాణాలు ఉండే అవకాశాలు స్వల్పమేనని తెలుస్తోంది.

మే 3 తర్వాత పరిస్థితులను అంచనా వేసి.. పలు ఆంక్షల నడుమే రైళ్లు, విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వ్యక్తిగతదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రైలు కోచ్ లో సీట్ల సామర్థ్యంలో సగం టికెట్లే విక్రయించాలని.. విమాన ప్రయాణాలకూ ఇదే వర్తింపజేయాలని పలువురు సూచనలు చేస్తున్నారు. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు ఇలాంటి చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...