Switch to English

రైళ్లు, విమానాలు ఇప్పట్లో లేనట్టే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

భారత్ లో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రావడంలేదు. నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా.. ప్రతిరోజూ పాజిటివ్ కేసుల ఇంకా వెలుగు చూస్తేనే ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలో 15,712 కేసులు నిర్ధారణ కాగా, 507 మంది మృత్యువాతపడ్డారు. పరిస్థితి చూస్తుంటే ఈ వైరస్ ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియడంలేదు. ఒకవేళ కేసుల సంఖ్య తగ్గి, మే 3వ తేదీతో లాక్ డౌన్ ఎత్తివేసినా.. విమానాలు, రైళ్లను నడిపే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.

రైలు, విమాన ప్రయాణాల్లో వ్యక్తిగత దూరం పాటించే అవకాశం లేనందున.. వాటికి అనుమతిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా రైళ్లు, విమానాలపై ఆంక్షలు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.

నిజానికి తొలి విడత లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు ప్రకటించగా.. భారతీయ రైల్వేతోపాటు విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుంచి ప్రయాణాలకు టికెట్లు విక్రయించాయి. కానీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగించడంతో ఆయా టికెట్ల సొమ్మును వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా.. మళ్లీ మే 4వ తేదీ నుంచి టికెట్లు విక్రయించాలని ఆయా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కేంద్రం వెంటనే రంగంలోకి దిగి.. అప్పుడే ఎలాంటి టికెట్లూ విక్రయించొద్దని వాటికి ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బుకింగులు ప్రారంభించొద్దని స్పష్టంచేసింది. దీంతో మే 3 తర్వాత సైతం రైళ్లు, విమాన ప్రయాణాలు ఉండే అవకాశాలు స్వల్పమేనని తెలుస్తోంది.

మే 3 తర్వాత పరిస్థితులను అంచనా వేసి.. పలు ఆంక్షల నడుమే రైళ్లు, విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వ్యక్తిగతదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రైలు కోచ్ లో సీట్ల సామర్థ్యంలో సగం టికెట్లే విక్రయించాలని.. విమాన ప్రయాణాలకూ ఇదే వర్తింపజేయాలని పలువురు సూచనలు చేస్తున్నారు. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు ఇలాంటి చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...