Switch to English

ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కి ఎక్కువ చెల్లించారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరోనా తాండవం జరుగుతున్న వేళ ఏపీలో అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ లో మాయాజాలం చోటుచేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది నిమిషాల్లోనే కరోనా పరీక్ష ఫలితాన్ని వెల్లడించే ఈ కిట్స్ ను ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసింది.

మొత్తం 10 లక్షల కిట్స్ కు ఆర్డర్ ఇవ్వగా.. తొలి విడతలో లక్ష కిట్లు రాష్ట్రానికి చేరాయి. తొలి కిట్ తో సీఎం జగన్ కు కరోనా నిర్ధారణ పరీక్ష జరిపిన అధికారులు.. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. అయితే, ఈ కిట్ ఎంతకు కొనుగోలు చేశారనే విషయాన్ని ఏపీ సర్కారు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో చత్తీస్ గఢ్ కు చెందిన మంత్రి ఒకరు తాము ర్యాపిడ్ టెస్ట్ కిట్ ను ఒక్కోటీ జీఎస్టీ కాకుండా రూ.337కే కొనుగోలు చేశామని, ఇదే అతి తక్కువ ధర అని ట్వీట్ చేయడంతో ఏపీలో దుమారం రేగింది.

రెండు రాష్ట్రాలూ కొరియాకి చెందిన ఒకే కంపెనీ నుంచి ఈ కిట్స్ ని కొనుగోలు చేయడంతో ఏపీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేశాయి. రూ.337 ఖరీదు చేసే కిట్ ను ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.1200 పెట్టి కొనుగోలు చేసిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు సంధించారు. దీంతో సర్కారు స్పందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందంటూ దుష్పచారం సాగుతోందని, రూ.1200కి ఆ కిట్ కొన్నారని ఆరోపణలు చేస్తున్నారని.. అదంతా అసత్యమని ప్రకటించింది.

ఒక్కో కిట్ ను రూ.700కి కొనుగోలు చేశామని.. తుది ధరపై సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ ఆ కిట్ కి రూ.700 చెల్లించినా.. ఛత్తీస్ గఢ్ వెచ్చించిన మొత్తానికంటే రెట్టింపు ఎక్కువ. దీంతో అటు టీడీపీ నేతలు.. ఇటు సోషల్ మీడియాలో అధికార పార్టీ వ్యతిరేకులు తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఏదైనా వస్తువు కొనే ముందే ధర విషయంలో సంప్రదింపులు ఉంటాయని.. ఫలానా ధరకు కొంటామని ఒప్పందం కుదుర్చుకుని, లక్ష కిట్లు తీసుకున్న తర్వాత ఏ విధంగా బేరమాడతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో వీటి ధర విషయంలో కర్ణాటక, ఛత్తీస్ గఢ్, కేరళ వంటి రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే దీనిపై వివరణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...