ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. గత ప్రభుత్వ హయాంలోని అక్రమాలను తవ్వి తీయడమే ప్రధాన ధ్యేయంగా అధికార పార్టీ ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే గత ఐదేళ్ల కాలంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దానికి సర్వ అధికారాలూ కట్టబెట్టింది. ఇంతటి కీలకమైన బాధ్యతలను ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డికి అప్పజెప్పింది.
రాష్ట్రంలో ఎందరో సీనియర్ అధికారులు ఉండగా.. జగన్ సర్కారు ఆయన్నే ఎందుకు ఎంచుకుంది అని చూస్తే, ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ఇక్కడ రెడ్డి అనే కోణాన్ని కాకుండా రఘురామిరెడ్డి ట్రాక్ రికార్డు చూసే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ముక్కుసూటి అధికారిగా పేరున్న రఘురామరెడ్డి.. ఆర్థికపరమైన అవకతవకల కేసులను పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. ఇలాంటి కేసులు ఆయన దగ్గరకు వస్తే వాటి అంతు చూసేదాకా వదిలిపెట్టరని పేరు.
ఆమ్వే ఇండియా, ఎన్ మార్ట్, నక్షత్ర, అక్షయ గోల్డ్ వంటి కేసులను దర్యాప్తు చేసి, నిందితులకు చుక్కలు చూపించింది ఈయనే. పైగా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు కూడా చేశారు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా ఉన్న రఘురామరెడ్డిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తే.. పరిపాలనా ట్రిబ్యునల్ కు వెళ్లి అక్కడ విజయం సాధించారు. తిరిగి కర్నూలు ఎస్పీగా వచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో తెలివిగా డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.
ఐదేళ్ల డిప్యుటేషన్ ముగియడం.. ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చేశారు. ఇదే సమయంలో సీఎం ఆయన్ను పిలిచి మంచి బాధ్యతలు అప్పగించారు. ఇక రఘురాముడు రంగంలోకి దిగడమే తరువాయి. జగన్ కోరుకున్నట్టుగా చంద్రబాబును ఆయన ఫిక్స్ చేస్తారా లేదా అన్నది చూడాలి.
849481 771905Right wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds need to always take a look at all with the wonderful value behind presenting and public speaking, which is to be someones truck. best man speeches brother 35377
316624 804378Some times its a discomfort in the ass to read what blog owners wrote but this internet web site is truly user genial ! . 98639