Switch to English

ఏపీ బీజేపీ.. అంతా అయోమయమే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని, ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని తహతహలాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది కలుగుతోంది. ఏ అంశంలోనైనా ఒక్కొక్కరూ ఒక్కో విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం అయోమయానికి తావిస్తోంది. పార్టీ వైఖరికి నేతల స్పందనకు సంబంధం ఉండటంలేదు. పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. ఇందులో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండగా.. మరో వర్గం వైసీపీ అనుకూల ధోరణి వ్యక్తంచేస్తోంది. మిగిలినవారు ఎటూ మొగ్గు చూపకుండా సైలెంట్ గా ఉంటున్నారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తొలి నుంచీ వైసీపీకి గట్టి వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు పలుకుతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని సుజనా తీవ్రంగా వ్యతిరేకించగా.. కన్నా ఆయన బాటలోనే నడిచారు. ఇక బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసిరంహారావు మాత్రం కాస్త వైసీపీ అనుకూల గొంతు వినిపిస్తున్నారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదని తొలి నుంచీ ఆయన చెబుతున్నారు. దానికి తగినట్టుగానే కేంద్రం ఇటీవల తన వైఖరి అదేనని స్పష్టంచేసింది.

ఎన్నికల ముందు టీడీపీ చంద్రబాబుకు వ్యతిరేకంగా జీవీఎల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక విధంగా వైసీపీకి అనుకూలంగా మారింది. ఎన్నికల తర్వాత కూడా జీవీఎల్ అదే విధంగా ముందుకెళ్తున్నారు. దీంతో ఆయన వైసీపీతో లోపాయకారీ అవగాహన కుదుర్చుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరంగా టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేశారు. అయితే, తాను పార్టీ విధానం మేరకే మాట్లాడుతున్నానని.. ఎవరు ఏం మాట్లాడినా తాను చెప్పిందే ఫైనల్ అని జీవీఎల్ ఓ సందర్భంగా స్పష్టంచేశారు. కానీ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ మాత్రం పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పిందే పార్టీ అభిప్రాయమని పేర్కొన్నారు.

ఇక తాజాగా కేంద్రంలో బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు కుదరబోతోందంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పార్టీకి ఎలాంటి సమాచారం లేదని కన్నా చెప్పగా.. సునీల్ దియోధర్, పురందేశ్వరి వంటి నేతలు మాత్రం అలాంటిది ఏమీ లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరి ఏమిటనేది తెలియక పలువురు గందరగోళానికి గురవుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...