Railway board: ‘ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్’లో మార్పు వల్లే కోరమాండల్ (Coromandel) ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రైల్వే శాఖ (Railway department) మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Aswini Vaishnav) తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే (Railway) భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదంపై విచారణ జరిపారు. జరిగిన తప్పిదాన్ని కనిపెట్టారు. బాధ్యులను కూడా గుర్తించారు. పూర్తి నివేదికను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం పునరుద్ధరణ చర్యలపైనే దృష్టి పెట్టాం. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ’ని అన్నారు.
రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ’ప్రమాద సమయంలో రెండు రైళ్ల వేగం గంటకు 130 కి.మీ ఉంది. అయితే.. ప్రమాదానికి ఇది కారణం కాదు. ఈ సమయంలో కవచ్ కూడా కాపాడలేదు. ఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. గూడ్స్ లో ఉన్న ఇనుప ఖనిజం వల్ల మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. గూడ్స్ ను ఢీకొట్టి కోరమాండల్ బోగీలు డెడ్ లైన్లో పడి అదే లైన్లో వెళ్తున్న బెంగళూరు-హవ్ డా రైలు చివరి రెండు బోగీలను ఢీకొట్టాయ’ని అన్నారు.