మెగాస్టార్ చిరంజీవి నేడు ఒక్కరోజే 3 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడ పది నిమిషాలు మాట్లాడి, ఆ వెంటనే ముంబైలో సల్మాన్ ఖాన్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది అంటూ హడావిడిగా వెళ్లి పోయిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానికి ముంబైలో సల్మాన్ ఖాన్ తో ప్రెస్ మీట్ లో పాల్గొన్న చిరంజీవి సాయంత్రానికి మళ్లీ హైదరాబాదు చేరుకున్నాడు.
హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్న పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఉదయం అల్లు రామలింగయ్య గారి గురించి ఎక్కువ మాట్లాడలేక పోతున్నాను.. సాయంత్రం తప్పకుండా మీ అందరి ముందుకు వచ్చి ఎక్కువ సమయం మాట్లాడతానని అన్నట్లుగానే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి తన మామగారైన అల్లు రామలింగయ్య తో తనకున్న అనుభవాలను తెలియజేశాడు. ఒక్కరోజే మూడు ఈవెంట్స్ లో పాల్గొన్న చిరంజీవి ని చూసి యంగ్ హీరోల నోరు వెళ్ళబెట్టాల్సిందే
191283 74305You got a extremely wonderful website, Sword lily I observed it by means of yahoo. 339750
72956 630520I discovered your weblog internet site internet website on the internet and appearance some of your early posts. Continue to maintain inside the great operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far far more from you obtaining out at a later date! 862644
352839 384766Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your client to communicate. Nice task.. 721728