హరియాణాలోని గుర్గావ్ సమీపంలోని నాథూపుర మురికివాడలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ వాడలో ఉన్న 700 గుడిసెలు దగ్దమయ్యాయి. ఒక గుడిసెలో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే మురికివాడంతా వ్యాపించాయి. అయితే.. ఈ ప్రమాదం నుంచి బస్తీవాసులు తృటిలో తప్పించుకోవడం.. ఎటువంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. గంటన్నర పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుడిసెల్లోని నిత్యావసరాలు, సామగ్రి, నగదు అంతా బుగ్గిపాలయ్యాయి. దీంతో ప్రజలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అధికారులు ప్రమాదస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు.
गुड़गांव डीएलएफ फेज 3 नाथूपुर मैं 200 झुग्गियों में आग लगने से 200 गरीब परिवार बेघर हो गए आज रात 3:00 बजे pic.twitter.com/Pzuoz6vNCN
— Vikash Singh (@VikashS23800552) April 2, 2021
464973 299220Were glad to become visitor on this pure web site, regards in this rare info! 434436
157868 61965How much of an appealing guide, keep on generating much better half 23419