వ్యవసాయంలో యాంత్రీకరణ చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ ఎత్తున రాయితీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసేందుకు రైతులు పది శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతంలో 50 శాతం బ్యాంకు ద్వారా రుణం వస్తుంది మరో 40 శాతం ప్రభుత్వం నుండి రాయితీ వస్తుంది. రైతులు 50 శాతం రుణంను చెల్లించుకుంటే సరిపోతుంది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆసక్తికలిగిన రైతులు ఈనెల 15వ తారీకు వరకు సంఘాలుగా ఏర్పడి దరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం పొందాలనుకునే వారు గతంలో ఏ బ్యాంకుకు కూడా రుణం ఎగవేసి ఉండకూడదు. అలాగే గతంలో రుణాల రికార్డ్ క్లియర్గా ఉండాలి. రూ. 12 లక్షల నుండి 1.3 కోట్ల వరకు రుణం పొందే అవకాశం ఉంది. యంత్రాలు కొనుగోలు చేసిన తర్వాత ఆ యంత్రాలు రైతులకు చేరిన తర్వాతే కంపెనీలకు ప్రభుత్వం రాయితీ సొమ్మును చెల్లిస్తుంది. తద్వారా రైతులకు త్వరగా పరికరాలు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైతులు ఖచ్చితంగా దీనిని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రభుత్వం సూచిస్తోంది.
874727 287247excellent day, your web site is really unquie. Anways, i do appreciate your function 371714
822829 600244I dont leave lots of comments on a great deal of blogs each week but i felt i had to here. Do you require several drafts to make a post? 442682