విద్యా హక్కు చట్టం పరిధిలో క్రైస్తవ పాఠశాలలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 13 వేల క్రైస్తవ పాఠశాలలు ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఆదా చేసుకుంటున్నాయని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) పేర్కొంది. ఈక్రమంలో క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలలను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీసీఆర్ ప్రయత్నిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం.. అన్ని అన్-ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ప్రవేశం కల్పించాలని చెప్తోంది.
మైనారిటీ ఎడ్యుకేషన్పై ఎన్సీపీసీఆర్ చేపట్టిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. 2017-18లో ప్రైవేటు అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సాధారణ కోర్సులు అభ్యసించేందుకు ఒక్కో విద్యార్థి చేసిన ఖర్చు రూ.18,267 అని ఎన్సీపీసీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఎన్సీపీసీఆర్ తెలిపిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 13 వేల క్రైస్తవ మైనారిటీ స్కూళ్ళు ఉన్నాయని తేలింది. ఇప్పుడీ చట్టం పరిధిలోకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ను తీసుకురావాలని ఎన్సీపీసీఆర్ ప్రయత్నిస్తోంది.
ఈ స్కూల్స్ లో ప్రస్తుతం 54,86,884 మంది చదువుతున్నారని.. వీరి నుంచి ఏడాదికి రూ.10,022.89 కోట్లు వసూలు చేస్తున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. విద్యా హక్కు చట్టం పరిధిలోకి మైనారిటీ పాఠశాలలు రాకపోవడం వల్ల.. సమాజంలో అణగారిన, బలహీన వర్గాలవారి పిల్లలకు క్రైస్తవ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం లేదు. ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారిలో 74.01 శాతం (కొన్ని రాష్ట్రాల్లో 80 శాతం) మంది నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారేనని ఎన్సీపీసీఆర్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
దీనిపై ఎన్సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు క్రైస్తవ సంస్థల పాఠశాలల్లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా విద్యా హక్కు చట్టాల్లో మార్పులు చేయాలి. మైనారిటీ స్కూల్స్గా చెప్పుకుంటూ.. నాన్ క్రిస్టియన్ కేటగిరీల్లోని ఉన్నత వర్గాలవారి పిల్లలను తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి’ అని అన్నారు.
166261 797334extremely very good post, i definitely actually like this excellent web site, continue it 367747
770570 608691Only a smiling visitant here to share the adore (:, btw wonderful design and style . 797568
572085 281439Precisely what I was looking for, thankyou for putting up. 647934