లాక్డౌన్లో చావుకు పది మంది, పెళ్లికి 20 మంది అంటూ ప్రభుత్వాలు కండీషన్ పెట్టాయి. ఇప్పటికి కూడా అదే కండీషన్ అమలులో ఉంది. కాని కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పాత బస్తీలోని దూల్పేట్లో ఒక వ్యాపారి తన కొడుకు వివాహ నిశ్చితార్థంను వైభవంగా నిర్వహించాడు. దాదాపుగా 300 మందికి పైగా నిశ్చితార్థంకు హాజరు అయ్యారు. ఆ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న వారిలో ఎవరికో కరోనా ఉన్నట్లుగా ఉంది. దాంతో ఇప్పుడు అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇప్పటికే వరుడి తండ్రి కరోనా పాజిటివ్తో మృతి చెందగా, మరో 15 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ సమయంలోనే 250 కుటుంబాలను కంటోన్మెంట్లో ఉంచారు. లాక్డౌన్లో నిశ్చితార్థం పెట్టుకున్న కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా కొందరు అత్యంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారు. వారి ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మరియు బంధువుల ప్రాణాలను కూడా గాల్లో కలిపేస్తున్నారు.
304894 102178Dead written subject matter, Truly enjoyed reading via . 717899
182426 728263So, is this just for men, just for ladies, or is it for both sexes If it s not, then do girls require to do anything different to put on muscle 999978
148347 458873I needs to spend a while studying much more or working out more. Thank you for wonderful information I was searching for this information for my mission. 370418