శాసన మండలిని కొనసాగించాలా.? వద్దా.? అన్న విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పలువురు వైసీపీ ముఖ్య నేతలు, శాసన మండలిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు. కానీ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం, మండలిని కొనసాగించడం దండగ.. అని తేల్చి చెప్పేస్తున్నారట.
నిజానికి మంత్రి వర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీలున్నారు. చాలామందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో, ఆ తర్వాతా, అంతకు ముందూ వైఎస్ జగన్ హామీలు ఇచ్చిన విషయం విదితమే. మాట మీద నిలబడటం.. అనే విషయాన్ని అధికారంలోకి వస్తూనే వైఎస్ జగన్ మర్చిపోయారనుకోండి.. అది వేరే విషయం. దానికి ‘అమరావతి’ తరలింపే నిదర్శనం.
ఇక, మండలి విషయానికొస్తే.. పార్టీలో అసంతృప్తులకు ‘అకామిడేషన్’ కోసం అన్నట్లు దాన్ని వినియోగించడం రాజకీయ పార్టీలకు అలవాటే. అధికార పార్టీ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ‘ఆదివారం రాత్రికల్లా ఏదో ఒకటి తేలిపోవాలి..’ అంటూ అధికార వైఎస్సార్సీపీ ‘హార్స్ ట్రేడింగ్’కి తెరలేపినట్లు తెలుస్తోంది. ‘అనర్హత వేటు పడే అవకాశమే లేదు..’ అని పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్సీలకు భరోసా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కనీ వినీ ఎరుగని స్థాయిలో ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మామూలుగానే ఎమ్మెల్సీగా ఛాన్స్ కోసం 10 నుంచి 25 కోట్ల దాకా ఖర్చు చేస్తుంటారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో విన్పిస్తుంటుంది. అంతకు మించి వెచ్చించేందుకూ అధికార పార్టీ వెనుకంజ వేయడంలేదట.
అయితే, ఇదంతా ఎందుకు దండగ.? అన్న ఆలోచనలోనూ వైఎస్ జగన్ వున్నట్లే కన్పిస్తోంది. సోమవారం ఉదయం క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశమవుతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలోనే శాసన మండలి అనేది వుండాలా.? వద్దా.? అనేది తేల్చేస్తారు. అయినా, మండలి అనవసరం.. అని చెప్పి, అదిరిపోయే ‘రేటు’ పెట్టి మరీ, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం ఏంటట!
55561 650514not everyone would require a nose job but my girlfriend truly needs some rhinoplasty coz her nose is kind of crooked- 282695
593149 583833Thankyou for all your efforts that you have put in this. extremely intriguing info . 387684