‘గుడ్ మార్నింగ్ సీఎం సార్..’ అంటూ జనసేన పార్టీ ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది.. రాష్ట్రంలో రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలు.. కాదు కాదు, గుంతల్లో మునిగిపోయిన రోడ్ల దుస్థితి నేపథ్యంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలని జనసేన నినదిస్తోంది.. జనసేన మాత్రమే కాదు, జనసేన క్యాంపెయిన్ ద్వారా సాధారణ ప్రజానీకం కూడా రోడ్ల మీద గుంతలతో తాము పడుతున్న ఇబ్బందుల్ని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు.
ఇంకోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో లబ్దిదారుల ఖాతాల్లోకి పది వేల చొప్పున సొమ్ములు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు.. లాంటి విమర్శలు షరామామూలుగానే చేసేశారు. ప్రజలకు మేలు చేస్తున్న గొప్ప ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారమంటూ అరిగిపోయిన పాత రికార్డునే మళ్ళీ ప్లే చేశారు.
వాహన మిత్ర.. రోడ్ల మీద గుంతలు.. ఈ విషయాన్నే తీసుకుంటే, వాహనాలు గాల్లో ఎగరవ్.. అవి రోడ్ల మీదనే నడవాలి. వాహన మిత్ర లబ్దిదారులు తమ వాహనాల్ని, రాష్ట్రంలో రోడ్ల మీద తిప్పడం ద్వారా ఎంత నష్టపోతున్నదీ వాళ్ళకే తెలుసు. ఏడాదికోసారి పదివేలు ఇస్తోంది లబ్దిదారులకి వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ, దాదాపుగా ప్రతి వారం, గుంతల రోడ్లలో తిరిగే వాహనాలకు రిపెయిర్లు తప్పనిసరి. అలా వంద రూపాయల దగ్గరనుంచి పది వేల దాకా మోత మోగిపోతోంది వాహనదారులకి.
సుమారు 230 కోట్ల రూపాయల దాకా లబ్దిదారులందరీకీ ఖాతాల్లో వేసేశామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. మరి, రోడ్లను బాగు చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారట.? ఈ ప్రశ్నకు వైసీపీ సర్కారు దగ్గర సరైన సమాధానాల్లేవు. కేవలం వానా కాలంలోనే కాదు, రాష్ట్రంలో రోడ్లు నిత్య నరకం.. ఇందులో ఇంకోమాటకు తావు లేదు.
ఆయా సంక్షేమ పథకాల్ని ప్రారంభించేందుకోసమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డు మార్గాన ఆయా ప్రాంతాల్లో తిరిగితే, వాహనదారుల కష్టాలు అర్థమయ్యేవేమో.. అన్నది స్వయానా వాహనదారులు చెబుతున్నమాట. ఇందులో విపక్షాలు చేసే దుష్ప్రచారం ఏముందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలియాలి.
838997 706779Spot lets start work on this write-up, I truly feel this fabulous website needs a terrific deal a lot more consideration. Ill apt to be once more to learn far more, appreciate your that info. 697530
338342 819115Merely wanna input that you have a very good web site , I enjoy the pattern it actually stands out. 652262