ప్రత్యేక హోదాపై అప్పుడేం చెప్పారు.? ఇప్పుడేం మాట్లాడుతున్నారు.? పోలవరం ప్రాజెక్టు విషయంలో అయినా, కడప స్టీలు ప్లాంటు విషయంలో అయినా, మరో విషయంలో అయినా.. ప్రస్తుత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పనిగట్టుకుని విపక్షాలు విమర్శలు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, వైసీపీ పాత వీడియోలే, ఇప్పుడు వైసీపీని పాతరేసేస్తున్నాయి.
పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర్నుంచి, పార్టీకి చెందిన ముఖ్య నేతల వరకూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఆయా విషయాలపై గతంలో ఏం మాట్లాడారు.? ఏం చేశారు.? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు.? ఏం చేస్తున్నారు.? అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నెటిజనం ఈ రోజుల్లో దేన్నీ ఊరికినే వదిలి పెట్టడంలేదు. చంద్రబాబు హయాంలో రోడ్ల పరిస్థితి గురించి అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన యాగీ అంతా ఇంతా కాదు. రోడ్లపై వర్షాల కారణంగా ఏర్పడ్డ చిన్నపాటి మడుకుల్లో వరినాట్లు వేసేశారు రోజా. ఆ సందర్భంలో ఆమె చేసిన విమర్శలు, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రోజమ్మా.. ఇప్పుడు కూడా రావమ్మా.. అంటూ, జనసైనికులు.. ఆనాటి వీడియోలు ప్రదర్శిస్తూ, వాటికి వైఎస్ జగన్ హయాంలో రోడ్లపై కొత్తగా ఏర్పడ్డ గోతుల్ని జత చేస్తున్నారు. ‘ఎటాక్’ అదిరింది కదూ.! ‘ఇదిగో మీ మంత్రిగారే.. మీ వైసీపీ ఎమ్మెల్యేనే.. మీ పాలనపై విమర్శలు చేస్తున్నారు చూడండి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్రంలో రోడ్లపై గుంతల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ట్యాగ్ చేస్తున్నారు.
ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ఇదే పరిస్థితి. రాజధాని అమరావతిని ఎంపిక చేసే క్రమంలో అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆ క్రమంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వైసీపీ, మూడు రాజధానుల మోజులో పడి, అమరావతిపై చేస్తున్న విమర్శల్నీ ప్రస్తావిస్తున్నారు.
5324 708382I believe this internet site contains very superb composed articles posts . 883784