Switch to English

విజయసాయిరెడ్డికి వైఎస్‌ జగన్‌ ‘బర్త్‌ డే షాక్‌’ ఇచ్చారా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీలో గత కొద్ది రోజులుగా ‘అంతఃపుర రాజకీయాలు’ తారాస్థాయికి చేరాయంటూ స్వయానా ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేస్తోన్న విషయం విదితమే. ఈ అంతఃపుర రాజకీయాల్ని గందరగోళం మార్చేసిన వ్యక్తులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. అన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన. ఈ ముగ్గురిలో విజయసాయిరెడ్డి ఒకింత ఎక్కువ అత్యుత్సాహం చూపుతుంటారు.. ‘అన్నీ నేనే, అంతా నేనే’ అన్న రీతిలో. ఈ కారణంగానే ఓ సజ్జల రామకృష్ణారెడ్డికీ, వైవీ సుబ్బారెడ్డికీ.. విజయసాయిరెడ్డితో వ్యవహారం ‘చెడింది’ అంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఇక, తాజాగా విజయసాయిరెడ్డి పుట్టినరోజునాడు, పార్టీకి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులకు మూడు కీలక బాధ్యతల్ని అప్పగించారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. విజయసాయిరెడ్డిని కేవలం మూడు జిల్లాలకు పరిమితం చేశారు వైఎస్‌ జగన్‌. మిగిలిన పది జిల్లాల్లో కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికీ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతల్ని వైవీ సుబ్బారెడ్డికీ అప్పగించారు వైసీపీ అధినేత. సజ్జల రామకృష్ణారెడ్డికి అదనంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతల్ని వైఎస్‌ జగన్‌ అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇన్ సైడ్ స్టోరీ: ఆ ముగ్గురికీ సీరియస్ వార్నింగిచ్చిన జగన్..?

నిజానికి, ఈ బాధ్యతలు పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనవి. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిని ‘కారు నుంచి దించేశారు’ అంటూ ఓ వీడియో తెరపైకొచ్చినప్పటినుంచే.. అసలు కథ మొదలయ్యిందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. అయితే, ఐదారు నెలల క్రితం నుంచే వైసీపీ అంతఃపుర రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయనీ, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్‌ జగన్‌ అసంతృప్తితో వున్నారనీ, రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌ తర్వాత వైఎస్‌ జగన్‌ మరింత అలర్ట్‌ అయ్యారనీ, ఈ క్రమంలోనే ఈ మార్పులు జరిగాయనీ అంటున్నారు.

అయితే, ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో పార్టీపైనా దృష్టిపెట్టిన వైఎస్‌ జగన్‌, చిన్న చిన్న మార్పులు చేశారే తప్ప.. ఇందులో ఆక్షేపణీయమేమీ లేదన్నది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. ఏదిఏమైనా, పార్టీలో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా వుండాలన్న ఉద్దేశ్యంతో విజయసాయిరెడ్డి ‘అంతఃపుర రాజకీయాలకు’ శ్రీకారం చుట్టారనీ, మరోపక్క సోషల్‌ మీడియాలో ఆయన ‘ఎక్స్‌ట్రా యాక్టివ్‌ వైఖరి’ ప్రత్యర్థులని ఇరకాటంలో పెట్టడం కంటే అధికార పార్టీనే ఇరకాటంలో పడేస్తోందనీ.. అధిష్టానం గుర్తించిందన్న వార్తలే నిజమైతే.. విజయసాయిరెడ్డి ప్రాబల్యం పార్టీలో క్రమక్రమంగా తగ్గబోతోందని అనుకోవాలేమో.

మొత్తమ్మీద, పుట్టినరోజునాడే ఈ ‘కానుక’ బహుశా విజయసాయిరెడ్డి ఊహించి వుండకపోవచ్చు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు కొత్త 108, 104 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తే, స్వయానా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీటికి పచ్చ జెండా ఊపితే ఈ కార్యక్రం గురించి కనీసం ఓ ట్వీట్‌ కూడా వేయలేకపోయారు విజయసాయిరెడ్డి. ఆయన ఆ కార్యక్రమంలో కన్పించకపోవడమూ పలు అనుమానాలకు తావిస్తోంది. 108 అంబులెన్స్ విషయమై పెద్ద కుంభకోణమే జరిగిందనీ, విజయసాయిరెడ్డి అల్లుడికి అప్పనంగా కోట్లు ముట్టజెప్పారనీ టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటిదాకా ఆయన ఈ విషయమై పెదవి విప్పలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...