యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా ‘అంతఃపుర రాజకీయాలు’ తారాస్థాయికి చేరాయంటూ స్వయానా ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేస్తోన్న విషయం విదితమే. ఈ అంతఃపుర రాజకీయాల్ని గందరగోళం మార్చేసిన వ్యక్తులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. అన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన. ఈ ముగ్గురిలో విజయసాయిరెడ్డి ఒకింత ఎక్కువ అత్యుత్సాహం చూపుతుంటారు.. ‘అన్నీ నేనే, అంతా నేనే’ అన్న రీతిలో. ఈ కారణంగానే ఓ సజ్జల రామకృష్ణారెడ్డికీ, వైవీ సుబ్బారెడ్డికీ.. విజయసాయిరెడ్డితో వ్యవహారం ‘చెడింది’ అంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఇక, తాజాగా విజయసాయిరెడ్డి పుట్టినరోజునాడు, పార్టీకి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులకు మూడు కీలక బాధ్యతల్ని అప్పగించారు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి. విజయసాయిరెడ్డిని కేవలం మూడు జిల్లాలకు పరిమితం చేశారు వైఎస్ జగన్. మిగిలిన పది జిల్లాల్లో కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికీ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతల్ని వైవీ సుబ్బారెడ్డికీ అప్పగించారు వైసీపీ అధినేత. సజ్జల రామకృష్ణారెడ్డికి అదనంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతల్ని వైఎస్ జగన్ అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇన్ సైడ్ స్టోరీ: ఆ ముగ్గురికీ సీరియస్ వార్నింగిచ్చిన జగన్..?
నిజానికి, ఈ బాధ్యతలు పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనవి. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిని ‘కారు నుంచి దించేశారు’ అంటూ ఓ వీడియో తెరపైకొచ్చినప్పటినుంచే.. అసలు కథ మొదలయ్యిందన్నది ఇన్సైడ్ సోర్సెస్ కథనం. అయితే, ఐదారు నెలల క్రితం నుంచే వైసీపీ అంతఃపుర రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయనీ, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ అసంతృప్తితో వున్నారనీ, రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ తర్వాత వైఎస్ జగన్ మరింత అలర్ట్ అయ్యారనీ, ఈ క్రమంలోనే ఈ మార్పులు జరిగాయనీ అంటున్నారు.
అయితే, ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో పార్టీపైనా దృష్టిపెట్టిన వైఎస్ జగన్, చిన్న చిన్న మార్పులు చేశారే తప్ప.. ఇందులో ఆక్షేపణీయమేమీ లేదన్నది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. ఏదిఏమైనా, పార్టీలో అందరికంటే ఎక్కువ యాక్టివ్గా వుండాలన్న ఉద్దేశ్యంతో విజయసాయిరెడ్డి ‘అంతఃపుర రాజకీయాలకు’ శ్రీకారం చుట్టారనీ, మరోపక్క సోషల్ మీడియాలో ఆయన ‘ఎక్స్ట్రా యాక్టివ్ వైఖరి’ ప్రత్యర్థులని ఇరకాటంలో పెట్టడం కంటే అధికార పార్టీనే ఇరకాటంలో పడేస్తోందనీ.. అధిష్టానం గుర్తించిందన్న వార్తలే నిజమైతే.. విజయసాయిరెడ్డి ప్రాబల్యం పార్టీలో క్రమక్రమంగా తగ్గబోతోందని అనుకోవాలేమో.
మొత్తమ్మీద, పుట్టినరోజునాడే ఈ ‘కానుక’ బహుశా విజయసాయిరెడ్డి ఊహించి వుండకపోవచ్చు. వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు కొత్త 108, 104 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తే, స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటికి పచ్చ జెండా ఊపితే ఈ కార్యక్రం గురించి కనీసం ఓ ట్వీట్ కూడా వేయలేకపోయారు విజయసాయిరెడ్డి. ఆయన ఆ కార్యక్రమంలో కన్పించకపోవడమూ పలు అనుమానాలకు తావిస్తోంది. 108 అంబులెన్స్ విషయమై పెద్ద కుంభకోణమే జరిగిందనీ, విజయసాయిరెడ్డి అల్లుడికి అప్పనంగా కోట్లు ముట్టజెప్పారనీ టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటిదాకా ఆయన ఈ విషయమై పెదవి విప్పలేదు.
882626 564644This really is great content material. Youve loaded this with useful, informative content that any reader can recognize. I enjoy reading articles that are so very well-written. 777067
90303 729249I recognize there exists a lot of spam on this blog. Do you want support cleansing them up? I may assist amongst courses! 375294
830881 958155Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im certainly enjoying your blog and look forward to new updates. 396182
601037 378915youve got an critical weblog proper here! would you wish to make some invite posts on my weblog? 403545
551376 771782You produced some decent points there. I looked on-line for any problem and found most individuals will go in conjunction with along with your internet site. 527176
105023 569098Hey i just visited your internet site for the very first time and i genuinely liked it, i bookmarked it and is going to be back 125788