ఏపీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత పార్టీలో ఎవరంటే అందరూ చెప్పే మాట సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అనే…కానీ ఈ ముగ్గురిలో నెంబర్ టూ అని ఎవరంటే ఎవరికి వారేనన్న సమాధానం వస్తుంది. దీంతో ఈ నెంబర్ టూ విషయంలో పార్టీలో ఉన్న గ్రూప్ వార్, జగన్ కు చికాకులు తెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎదురుపడినపుడు ఆ ముగ్గురూ ఆలింగనాలు చేసుకుని ఆవాజ్ దో హమ్ ఏక్ హై వంటి నినాదాలిచ్చినా కాసేపటికే ఎవరికి వారే యమునా తీరేనన్నది పార్టీలో అంతర్గతంగా వినిపించే మాట.
ఇలాంటి పరిస్థితుల్లో మొన్నీమధ్య వైజాగ్ ఎల్జీపాలిమర్స్ లో ప్రమాదం సంభవించిన సమయంలో తన కారు నుండి సాయిరెడ్డిని జగన్ దింపేసిన ఘటన పార్టీలోనూ, బయటా పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి జగన్ దగ్గర సాయిరెడ్డి హవా తగ్గిపోయిందన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ తనకు డ్యామేజ్ జరుగుతుందని గ్రహించిన సాయిరెడ్డి నష్టనివారణకు శతవిధాలా ప్రయత్నించి ఓమాదిరిగా బయటపడ్డారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదనీ, ప్రాణం పోయేంతవరకూ పార్టీలోనే, జగన్ తోనే ఉంటానని కూడా మీడియాముఖంగా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే జరిగిన ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన సాయిరెడ్డి, అసలా వీడియో బయటకు రావటానికి కారణాలను అన్వేషించిన మీదట ఉద్దేశ్యపూర్వకంగానే ఆ ఎపిసోడ్ జరిగిందన్న అభిప్రాయానికి వచ్చారట. తనతోపాటు నెంబర్ టూ రేసులో ఉన్న ఆ ఇద్దరి నేతల్లో ఒకరు ఇదంతా చేయించారనీ, సీఎంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇందుకు సహకరించారని సాయిరెడ్డి బలంగా నమ్మారు. దీంతో మళ్లీ గ్రూప్ వార్ తెరపైకి వచ్చింది. ఓ ప్రముఖ ఛానెల్ ద్వారా సదరు నేత తనను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారనీ, కాబట్టి తనపై తెరవెనుక జరుగుతుందన్న తతంగంపై సీరియస్ గా దృష్టిపెట్టాలని సీఎం జగన్ కు సాయిరెడ్డి మొరపెట్టుకున్నట్లు వినికిడి.
అయితే విషయం తెలుసుకున్న సదరు ముఖ్యనేత కూడా అలాంటిదేం లేదు, తెరవెనుక కుట్రలు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పైగా సాయిరెడ్డి వైపు నుండి జరుగుతున్న కొన్ని పరిణామాలపై జగన్ కు రివర్స్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పాలనాపరంగా ఎదురవుతున్న సమస్యలు, రాజకీయవిమర్శలపై ఉమ్మడిగా పోరాడాల్సిన తరుణంలో ఇలా గ్రూపులు కట్టడంపై చిరాగ్గా ఉన్న జగన్, ఈ ముగ్గురు నేతల్ని పిలిచి కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలిసింది.
151 సీట్లు వచ్చినంత మాత్రాన రిలాక్సవటం మంచి పద్ధతి కాదనీ, ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని పార్టీలో గ్రూపులున్నాయన్న ఫీలర్స్ బయటకు పంపటం మంచిది కాదని నేతలకు చెప్పినట్లు సమాచారం. ఒకరి పరిధిలో మరొకరు వేలు పెట్టకుండా ఎవరికి వారికి బాధ్యతలు కూడా కట్టబెట్టినట్లు తెలిసింది.
రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు బాధ్యుడిగా సజ్జల రామకృష్ణారెడ్డినీ, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు బాధ్యుడిగా వైవీ సుబ్బారెడ్డినీ, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డి ని చూడమని స్పష్టం చేసిన జగన్ మిగతా విషయాల్లో వేలుపెట్టొద్దని సదరు నేతలకు గట్టిగానే సూచించారట. ఇలా జిల్లాలవారీ బాధ్యతల్ని గతంలోనే అప్పగించినప్పటికీ వాటిని వదిలేసి అంతర్గతపోరుపై దృష్టిపెట్టటం ఎవ్వరికీ మంచిది కాదనీ, ఇదే లాస్ట్ వార్నింగని చెప్పటంతో సదరు ముగ్గురు నేతలు మొఖాలు చూసుకుని మారు మాట్లాడకుండా తలూపి వచ్చేశారట. మరి పార్టీ బలాన్ని నేతల బలహీనతలు దెబ్బతీస్తే నష్టపోయేది జగనే కదా..ఏమంటారు..?
358951 947522great post. Neer knew this, thanks for letting me know. 637669
775830 114861woah i like yur website. It genuinely helped me with the info i wus searching for. Appcriciate it, will bookmark. 930348
303856 553952Its always good to learn ideas like you share for weblog posting. As I just started posting comments for weblog and facing dilemma of lots of rejections. I think your suggestion would be beneficial for me. I will let you know if its function for me too. 639954
92687 831324excellent work Superb weblog here! Also your web web site a lot up fast! What internet host are you the usage of? Can I get your associate link on your host? I want my internet site loaded up as quickly as yours lol 924966