దాదాపు ఏడాదిన్నర క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో ‘సభకు నమస్కారం’ అనే సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అల్లు అర్జున్ వేరే సినిమాలతో, దిల్ రాజు కూడా తన కమిట్ మెంట్స్ లో బిజీ అయిపోయారు. కానీ ఈ లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్ట్ ని మరోసారి ఫైనల్ చేసి ట్రాక్ లో పెట్టే పనిలో దిల్ రాజు ఉన్నారు.
రీసెంట్ గా మరోసారి కొత్త రైటర్ సతీష్ ఈ సినిమా స్క్రిప్ట్ ని దిల్ రాజుకి పూర్తిగా నేరేట్ చేసారు. అది బాగా నచ్చడంతో దిల్ రాజు ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. పక్క మాస్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాకి రామ్ చరణ్ అయితే బాగుంటుందని చరణ్ తో సంప్రదింపులు జరపగా, స్టోరీ నచ్చడంతో రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకి ‘సభకునమస్కారం’ అనే టైటిల్ ని ఖరారు చేశారట.
మరి కొత్త వాడైనా సతీష్ కే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా లేక వేరే ఎవరి చేతికైనా డైరెక్టర్ పగ్గాలు వెళ్తాయా అనేది ఇంకా ఖరారు కాలేదట. ఈ విషయంపై రామ్ చరణ్ – దిల్ రాజు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాల తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. లాక్ డౌన్ సమస్యలు సెట్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.
38837 620759dog grooming could be the specialty of my sister, she really loves grooming every dog in our house 141744
254446 403394An attention-grabbing dialogue is value comment. I believe that you need to write a lot more on this matter, it wont be a taboo subject however normally individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 192584