తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల నుంచీ మద్దతు దక్కింది. కానీ, ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమానికి అందరూ కలిసి తూట్లు పొడిచారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన విభజన పిడుగు పడటానికీ కారణం ఇదే. ఐదేళ్ళు పూర్తవుతున్నా, ఆంధ్రప్రదేశ్కి ఇంకా ప్రత్యేక హోదా రాలేదంటే, దానికి కారణం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడమే.
వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడితే, టీడీపీ లైట్ తీసుకుంది. టీడీపీ ప్రత్యేక హోదా కోసం పోరు మొదలు పెడితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెని చూస్తున్నాం. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి వచ్చి, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి ఎందుకు రావు.? ఇదే విషయమై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు. విశాఖలో నవంబర్ 3న తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’కి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీల్ని కోరారు. ‘ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు.. ఇది ప్రజల సమస్య. ఇది రాష్ట్ర సమస్య. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కటయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఏకం కావాలి..’ అని జనసేనాని పిలుపునిచ్చారు.
మరి, జనసేనాని పిలుపుతో ఎవరు కలిసొస్తారో వేచి చూడాల్సిందే. సొంతంగా జనసేనానికి బలం లేక కాదు, అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కటైతే అయినా అధికార పార్టీలో చలనం వస్తుందనే ఆలోచనతోపాటుగా, బాధితులకు అన్ని రాజకీయ పార్టీలూ భరోసా ఇచ్చినట్లవుతుందని జనసేన పార్టీ తరఫున ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్.
304439 797052Great post, well put together. Thanks. I is going to be back soon to check out for updates. Cheers 555326
583244 936881Seriously quite great contribution, I genuinely depend on up-dates of your stuff. 69352
713577 452636Hi, you used to write excellent articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past few posts are just slightly out of track! 1317