సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ అభిమానులకీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకీ మధ్య చాలా పెద్ద రచ్చ నడుస్తోంది. ఇద్దరి సినిమాలూ ఒకే రోజు విడుదల కానుండడమే ఇందుకు కారణం. ఇదిలా వుంటే, మహేష్ హీరోగా రూపొందుతోన్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో హీరోయిన్ రష్మిక మండన్న, అల్లు అర్జున్ తదుపరి సినిమాలో హీరోయిన్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమయ్యింది.
అయితే, ఈ ప్రారంభోత్సవానికి రష్మిక హాజరు కాలేదు. ఆమె ‘భీష్మ’ సినిమా షూటింగ్లో బిజీగా వుంది. ఆ విషయాన్నే సోషల్ మీడియాలో అభిమానుల్ని ఉద్దేశించి పేర్కొంది. ఇక్కడే, మహేష్ అభిమానులకి ఒళ్ళు మండిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ అప్డేట్స్ గురించి మాట్లాడటంలేదుగానీ, అల్లు అర్జున్ సినిమా గురించి ఓవరాక్షన్ చేస్తావా.? అంటూ బూతులు తిట్టేస్తున్నారు.
మరోపక్క, అల్లు అర్జున్ అభిమానులూ తగ్గడంలేదు.. అల్లు అర్జున్తో సినిమా కన్నా ‘భీష్మ’ షూటింగ్ ముఖ్యమా.? అని నిలదీసేస్తుండడం గమనార్హం. ముందుగా కమిట్ అయిన సినిమా షూటింగ్కి ఇబ్బందులు కల్పించకూడదనే ఏ నటుడు అయినా, నటీమణి అయినా అనుకుంటారు. సో, ఇక్కడ రష్మికని తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, అభిమానుల్లో కొందరు దురభిమానులుంటారు కదా, అక్కడే అసలు సమస్య వచ్చిపడ్తోంది.
నిజానికి, మహేష్ అభిమానులూ అంత దారుణంగా ఆమెపై విరుచుకుపడరు. అక్కడా దురభిమానులే ఆమెపై బూతులతో విరుచుకుపడ్తున్నారన్నమాట. ఇదిలా వుంటే, సోషల్ మీడియాలో రష్మికకి ఫాలోవర్స్ ఎక్కువే. పైగా వాళ్ళలోనూ వీరాభిమానులున్నారు.. వాళ్ళంతా హేటర్స్కి తమదైన స్టయిల్లో సమాధానమిచ్చేస్తున్నారు.
347283 58926Some actually fascinating info , well written and loosely user genial . 957659
760073 341452Wow that was strange. I just wrote an incredibly long comment but soon after I clicked submit my comment didnt appear. Grrrr effectively Im not writing all that over again. Regardless, just wanted to say great weblog! 782171