సమ్మె ద్వారా డిమాండ్లు సాధించాలని భావించిన ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 52 రోజులపాటు సమ్మె చేసినా అటు సర్కారు పట్టు వీడకపోవడం.. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో సమ్మె విరమించి విధుల్లో చేరాలని భావించారు. కానీ చట్టవిరుద్ధంగా సమ్మె చేసినందున వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఎండీ స్పష్టంచేశారు.
కేసు లేబర్ కోర్టులో ఉన్నందున అక్కడ తీర్పు మేరకే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారేమోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని ఇక తేల్చయాలనే భావిస్తున్నట్టు సమాచారం. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే పక్షంలో షరతులు విధిస్తారని అంటున్నారు.
దాదాపు సగం రూట్లను ప్రైవేటీకరణకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో దాదాపు 20వేల మంది సిబ్బంది మిగిలిపోతారు. వారిని ఏం చేయాలనే అంశమే సర్కారుకు పెద్ద సవాల్ గా మారింది. వారిందరినీ వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా పంపించాలంటే దాదాపు రూ.5వేల కోట్లు అవసరమని లెక్క కట్టారు. ఇప్పటికే 5వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సంస్థకు అది తలకు మించిన భారమే అవుతుంది. అలా కాకుండా వచ్చే నాలుగైదేళ్లలో భారీ సంఖ్యలో కార్మికులు రిటైర్ కానున్న పక్షంలో అప్పటివరకు ఎలాగైనా నెట్టుకొస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇది కాకుంటే ప్రైవేటీకరణ చేసిన రూట్లలో కూడా ఆర్టీసీ సిబ్బందినే వినియోగించే సాధ్యాసాధ్యలపై కూడా కసరత్తు జరుగుతోంది. అందుకు అనుగుణంగా సంబంధిత బస్సుల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుంటే వీఆర్ఎస్ బాధ తప్పే అవకాశం ఉందని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కార్మికుల భవితవ్యం ఏమిటనేది నేడో రేపో తేలిపోనుంది. ప్రభుత్వం వారిని కనికిరించి దగ్గరకు తీసుకుంటుందా లేక కాదు పొమ్మంటుందా అనే అంశంపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
746928 960458You completed certain very good points there. I did searching on the topic matter and found most persons will go together along with your weblog 200338
826222 80306Some times its a pain in the ass to read what blog owners wrote but this site is truly user pleasant! . 916892