కరోనాతో చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఆమధ్య ఓ మహిళ కోర్టుకెక్కింది. కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్ కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటివల ఆమె భర్త కరోనాతో పలు అవయవాలు దెబ్బతిని స్టిర్లింగ్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే.. అతడు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్లు అతడి భార్యకు చెప్పారు. అయితే.. భర్త వీర్యం ఇప్పించాలని ఆమె డాక్టర్లను కోరింది. ఐవీఎఫ్ పద్ధతి కోసం కోర్టు అనుమతి తప్పనిసరి అని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
తన భర్త బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. అతని స్పెర్మ్ ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. దీంతో వీర్య సేకరణకు కోర్టు అత్యవసర అనుమతులు ఇచ్చింది. కానీ, వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే అతడు మృతి చెందడం విషాదం నింపింది.
253468 951272Some genuinely good stuff on this site , I it. 26205
462342 724941bathroom towels need to be maintained with a excellent fabric conditioner so that they will last longer:: 59180