సూపర్ స్టార్ మహేష్ బాబును దర్శకుల హీరో అంటుంటారు. ఇప్పుడు కాదు ఇది మహేష్ కెరీర్ ఆరంభం నుండి ఉంది. ఒక్కసారి కథ లాక్ అయిపోయాక దర్శకుడు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లడం మహేష్ కు అలవాటు. అందుకే దర్శకులందరూ మహేష్ అంటే లైకింగ్ చూపిస్తారు.
దీని వల్ల మహేష్ కొన్నిసార్లు లాభపడ్డా, ముందు వెనకా చూసుకోకుండా దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోవడం వల్ల డిజాస్టర్లు, సెటైర్లు పడ్డాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి సినిమాల తర్వాత దర్శకులను గుడ్డిగా నమ్మి వెళ్లిపోవడం అనేది మహేష్ పూర్తిగా తగ్గించేసాడు. కథలపై సందేహాలు పెరిగాయ్. దర్శకుడితో తనకెంత చనువున్నా కానీ కథల విషయంలో ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
ఈ విషయంలో కొన్ని సార్లు దర్శకులతో మహేష్ కు అభిప్రాయ బేధాలు వచ్చాయి. అయినా కూడా మహేష్ తన పంథా మార్చుకోలేదు. దీని వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దూరం పెరిగింది. సుకుమార్ తో అభిప్రాయ బేధాల కారణంగా సినిమా వదులుకోవాల్సి వచ్చింది. పూరి జగన్నాథ్ తో పూర్తిగా తెగిపోయింది. అతను బహిరంగంగానే మహేష్ పై విమర్శలు చేస్తున్నాడు. కొరటాల శివతో సంబంధాలు బాగున్నా ఇప్పటికే రెండు సినిమాలు చేసేసాడు. మరో సినిమాకు టైం పడుతుంది. రాజమౌళితో కమిట్మెంట్ ఉన్నా అది ఎప్పటికి జరుగుతుందో ఎవరికీ తెలీదు.
అందుకే మహేష్ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. యువ దర్శకులు అయితే బెటర్ అని ఫీలవుతున్నాడు. అందుకే నాలుగు సినిమాలు అనుభవమున్న అనిల్ రావిపూడికి అవకాశమిచ్చాడు. ఇప్పుడు పరశురామ్ తో పనిచేయబోతున్నాడు. ఇదే స్ట్రాటజీని మహేష్ కంటిన్యూ చేసినా ఆశ్చర్యం లేదు.
697714 676413This kind of lovely blog youve, glad I located it!?? 645991
935846 184039Thanks for the data provided! I was researching for this write-up for a long time, but I was not able to see a dependable source. 792797