ఇండియన్ క్రికెట్లో ఓ సంచలనమవుతాడనుకున్న యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్, జట్టుకి భారంగా మారిపోతున్నాడు. అవకాశాల్ని దక్కించుకోవడంలో సఫలమవుతున్న రిషబ్ పంత్, ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతుండడంతో సహజంగానే అతని పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. పంత్ మంచి స్ట్రోక్ ప్లేయర్.. కానీ, అదొక్కటే సరిపోదు. జట్టు కోసం అవసరమైనప్పుడు సత్తా చాటాల్సి వుంటుంది.
వికెట్ల వెనుకాల మెరుపులా కదులుతాడుగానీ, ఆ అత్యుత్సాహం ఒక్కోసారి జట్టు కొంప ముంచేస్తోంది. బంగ్లాదేశ్తో టీ20 సందర్భంగా పంత్ తన పేలవమైన ఆటతీరు ప్రదర్శించిన విషయం విదితమే. జట్టులో ధోనీ వారసుడి కోసం ఎప్పటినుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి. దినేష్ కార్తీక్ని ట్రై చేసి, పక్కన పెట్టారు. పార్తీవ్ పటేల్ని కూడా చూసేశాం. సంజు శాంసన్.. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
నిజానికి, పంత్ కంటే సంజూ శాంసన్ చాలా చాలా బెటర్ అయినా, రిషబ్ పంత్ని జట్టులో ఆడించేందుకు క్రికెట్ పెద్దలు గట్టిగానే ‘పంతం’ పట్టేయడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఓ మ్యాచ్లో ఫెయిలయితే, అదృష్టం కలిసిరాలేదని అనుకోవచ్చు. వరుసగా, అన్ని మ్యాచ్లలోనూ ఫెయిలవుతున్నా, రిషబ్ పంత్కి ఎలా అవకాశాలు వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడంలేదు.
సంజు శాంసన్ మాత్రమే కాదు, అలాంటోళ్ళు చాలామంది వున్నారు భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే కసితో. ఇకపై రిషబ్ పంత్ని పక్కన పెట్టడమే బెటర్. అతని స్థానంలో ఇంకొకర్ని ప్రయత్నిస్తే.. ఎవరో ఒకరు ధోనీకి వారసుడిగా నిలబడగలుగుతాడేమో.!
118415 28869Could it be okay to write several of this on my small web web site only incorporate a 1 way link to the site? 518804