విశాఖలో స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని.. అమ్మే హక్కు కేంద్రానికి లేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ‘ఉక్కు గర్జన’ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. బహిరంగ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు, పరిశ్రమ ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతోనే అనేక నష్టాలు వస్తాయని అన్నారు. ప్రైవేటుపరమైతే కార్మిక చట్టాలు కనుమరుగవుతాయని కార్మికులు అన్నారు. తమ పోరాటానికి దేశవ్యాప్త మద్దతు లభిస్తోందని అన్నారు. దేశంలోని అన్ని ఉక్కు పరిశ్రమల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రమే సొంత గనుల్లేవని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్ రూపాయి తీసుకోకపోయినా నష్టాల్లో ఉన్నట్టు కేంద్రం ప్రచారం చేయడం తగదన్నారు. ప్రైవేటీకరణ అంటే దేశాన్ని కొల్లగొట్టడమే అని అన్నారు. గత ఏడాది ప్రపంచంలో ఏ స్టీల్ ఫ్యాక్టరీకి లాభాలు లేవని.. విశాఖ స్టీల్ మాత్రమే లాభాల్లో ఉందన్నారు.
266645 293938hey great web site i will definaely come back and see once more. 103476
688368 934177As far as me being a member here, I wasnt aware that I was a member for any days, truly. When the write-up was published I received a notification, so that I could participate in the discussion of the post, That would explain me stumbuling upon this post. But were undoubtedly all members within the world of concepts. 746134