విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర రూపం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్లాంటు ఉద్యోగి గాజువాకకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ‘తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నా’నంటూ రాసిన లేఖ తీవ్ర కలకలం రేపింది. తాను పరిశ్రమలోని ఉక్కు ఫర్నేస్ లో పడి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసున్న లేఖ ఆయన టేబుల్ వద్ద లభ్యమైంది. అక్కడే ఐడీ కార్డు, పర్సు, సెల్ ఫోన్ కూడా ఉన్నాయి. ఈరోజు ఉదయం 5గంటల షిప్టుకు శ్రీనివాసరావు వెళ్లినట్టు తెలుస్తోంది.
‘కార్మిక సోదరులా.. మనందరం కలసికట్టుగా ఈ పోరాటంలో విజయం సాధించగలం. జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. నా ప్రాణాన్ని ఉక్కు పరిశ్రమ కోసం త్యాగం చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానీయద్దు. ఉక్కు ఫర్నేస్ ఆత్మాహుతికి సాయంత్రం 5:49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచే మొదలు కావాలి’ అని రాసుంది. దీంతో పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు.
489347 626963I actually thankful to discover this web site on bing, just what I was seeking for : D too bookmarked . 845560