Viral News: పొదుపు గురించి నేటి రోజుల్లో అవగాహన ఎక్కువ. నగదును పెట్టుబడులు, షేర్స్, బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారు. కానీ.. పొదుపు గురించి అవగాహనలేని రోజుల్లో పెట్టుబడి పెట్టి వదిలేస్తే.. అవి నేడు బంగారమే. అటువంటి ఘటనే పంజాబ్ లో జరిగింది. 30ఏళ్ల క్రితం ఓ వ్యక్తి షేర్స్ కొని మర్చిపోగా.. ఇప్పుడవి మనవడి చేతికి లక్షల్లో వచ్చాయి.
చండీఘడ్ లో డాక్టర్ తన్మయ్ మోతీవాలా చిన్నపిల్లల డాక్టర్. ఆయన తాత 1994లో రూ.500 విలువ చేసే ఎస్ బీఐ షేర్స్ కొన్నారు. అవి విక్రయించకుండా వదిలేశారు.. మర్చిపోయారు. ఇప్పుడు తమ ఆస్తుల పత్రాలు వెలికి తీస్తూండగా షేర్స్ బయటపడ్డాయి. ప్రస్తుత మార్కెట్లో వాటి విలువ రూ.3.75లక్షలుగా ఉండటంతో మోతీవాలా సంతోషంలో మునిగిపోయాడు.
3లక్షలు తక్కువ అనిపించినా 30ఏళ్లలో 75 రెట్లు ఎక్కువగా రావడం చిన్న విషయం కాదు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నీది అదృష్టమని.. మాకూ ఇలాంటివి జరిగాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.