విప్లవ కవి వరవరరావు ప్రస్తుతం ఎల్గార్ పరిషత్ కేసు లో నవీ ముంబయిలోని తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా కాలంగా ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే ఆయన్ను ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటూ కోర్టులో కుటుంబ సభ్యులు మరియు ఆయన మద్దతుదారులు విజ్ఞప్తి చేశారు.
తాజాగా బాంబే హైకోర్టు మహా ప్రభుత్వంను మరణశయపై ఉన్న వరవరరావుకు చికిత్స అందించాల్సిన బాధ్యత ఉందని, ఒక విచారణ ఖైదీకి ట్రీట్మెంట్ అందించక పోవడం సబబు కాదంటూ కోర్టు పేర్కొంది. ముంబాయిలోని నానావతి ఆసుపత్రిలో జాయిన్ చేసి 15 రోజుల పాటు చికిత్స అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆయనకు జైల్లో చికిత్స అందిస్తున్నట్లుగా ప్రభుత్వం తరపు న్యాయవాది తెలియజేశారు. అతడి వాదనపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. జైల్లో పెట్టేది పారిపోకుండా ఉండటం కోసం అనారోగ్యంతో బాధపడుతున్న అతడు ఎలాగూ పారిపోలేడు.
కనుక ఆసుపత్రిలో చికిత్స అందిస్తే పోయేది ఏమీ లేదని, ఆయన విచారణ ఖైదీగా ఉన్న కారణంగా 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స చేయించడంతో పాటు ఆ ఖర్చులను కూడా ప్రభుత్వం భరించాలంటూ కోర్టు ఆదేశించింది. అందుకు ప్రభుత్వం ఓకే చెప్పంది.
458945 123584hello I was very impressed with the setup you used with this blog. I use blogs my self so congrats. definatly adding to favorites. 167263
532800 197058I want to start a weblog but would like to own the domain. Any concepts how to go about this?. 498581
486079 878078Glad to be among the visitors on this awe inspiring internet website : D. 341454