Switch to English

బోగాపురం కోసం.. విశాఖను మూసెయ్యాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం.. కానీ, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం వుండకూడదు. అక్కడ 30 ఏళ్ళపాటు సివిల్‌ ఆపరేషన్స్‌ మూసెయ్యాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను కేంద్ర మంత్రికి సమర్పించారు.. కేంద్ర మంత్రితో ఈ విషయమై మాట్లాడారు కూడా. చంద్రబాబు హయాంలోనే విశాఖ సమీపంలోని భోగాపురంలో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన విషయం విదితమే.

ప్రతిపాదిత విమానాశ్రయం విజయనగరం జిల్లాలో, విశాఖకు దగ్గరగా ఏర్పాటవుతుంది. ఆ విమానాశ్రయం నిర్మితమైతే, విశాఖ విమానాశ్రయంలో సివిల్‌ ఆపరేషన్స్‌ ఎందుకు ఆపేయాలి.? అన్న చర్చ విశాఖ వాసుల్లో బయల్దేరింది. శంషాబాద్‌ విమానాశ్రయ నిర్మాణం తర్వాత, బేగంపేట విమానాశ్రయంలో సివిల్‌ ఆపరేషన్స్‌ ఆగిపోయిన విషయం విదితమే. అయితే, తెలంగాణలో పరిస్థితులు వేరు.. ఆంధ్రప్రదేశ్‌లో వేరు.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తామనే పేరుతో, విశాఖ ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే.. విశాఖ విమానాశ్రయంలో సివిల్‌ ఆపరేషన్స్‌ 30 ఏళ్ళపాటు రద్దు చేయాలని కేంద్రాన్ని వైసీపీ కోరుతోందన్న ఆవేదన విశాఖ వాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపాదిత బోగాపురం విమానాశ్రయం ఎప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుంటుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ప్రస్తుతానికైతే క్లారిటీ లేని పరిస్థితి. ఈలోగా ‘30 ఏళ్ళపాటు విశాఖలో సివిల్‌ ఆపరేషన్స్‌ రద్దు’ ప్రతిపాదన ఎందుకు తెరపైకొచ్చినట్లు.?

విశాఖ మీద ‘ఎగ్జిక్యూటివ్‌’ ప్రేమ చూపుతూనే, విశాఖకు వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందా.? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విశాఖ భూముల మీద ప్రేమ తప్ప, విశాఖ అభివృద్ధి పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదన్న వాదనలపై వైసీపీ ఎలాంటి సమాధానమిస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ హైద్రాబాద్‌ తర్వాత అంతటి ప్రాముఖ్యత వున్న నగరం విశాఖ, ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత కూడా పాలకుల నుంచి నిర్లక్ష్యానికి గురవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...