ఆఫ్గనిస్థాన్ లో మారణ హోమానికి అంతే ఉండటం లేదు. నిత్యం ఆత్మాహుతి దాడులతో హోరెత్తిపోయే ఆ దేశంలో మరోసారి అటువంటి మారణహోమం జరిగింది. ఈ దారుణకాండలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మృతి చెందారు. నంగర్ హార్ ప్రావిన్స్ లోని ఘనిఖిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద ఈనెల 3న ఆత్మాహుతి దాడి జరిగింది. కొందరు ముష్కరులు కారు బాంబు ద్వారా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ దాడిలో 15 మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందగా.. మరో 30 వరకూ గాయపడ్డారు. కొందరు ముష్కరులను స్థానిక పోలీసులు కాల్చి చంపారు. ఈ దాడిలో మృతి చెందిన అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశారు. స్థానిక ప్రభుత్వం ఈ దాడిని ధ్రువీకరించింది.
71737 782417I like this weblog so much, saved to bookmarks . 132736
881703 466894Deference to web site author , some wonderful entropy. 702783