అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ తన పాలనలో ఉండాల్సిన మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కట్టబెడుతున్నట్టు ‘ది వాషింగ్టన్ పోస్ట్’, ‘పోలిటికో’ కథనాలు ప్రచురించడం విశేషం.
బైడెన్ స్ధానం కల్పించనున్న ఆ ఇద్దరిలో ఒకరు వివేక్ ముర్తి కాగా.. మరొకరు అరుణ్ మజుందార్. వీరిద్దరికీ తన క్యిబినెట్ లో ఆరోగ్యం, ఇంధన శాఖలు అప్పగించనున్నారని తెలుస్తోంది. మొదటి నుంచీ భారత్ పై అనుకూల ధోరణితో ఉండే బైడెన్ భారతీయ అమెరికన్లకు తమ మంత్రివర్గంలో స్థానం కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాలో స్థిరపడిన వివేక్ మూర్తి స్వస్థలం కర్ణాటక. బైడెన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హెల్త్ టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం హించినవారిలో ఒకరు. త్వరలో బైడెన్ ఏర్పాటు చేయబోయే కరోనా అడ్వైజరీ బోర్డుకు మూర్తి సహ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. ఒబామా, ట్రంప్ హయాంలో అమెరికా సర్జన్ జనరల్ గా పని చేశారు. పబ్లిఖ్ హెల్త్ సర్వీస్ కమిషన్ కు వైస్ అడ్మిరల్ గా పని చేశారు. హర్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదివారు.
ఇంధన రంగంలో మంచి అనుభవం ఉన్నవారు అరుణ్ మజుందార్. గతంలో ‘అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఏజెన్సీ ఎనర్జీ ఈ’ కి తొలి డైరక్టర్ గా పని చేశారు. 2009లో ఈ పదవికి ఒబామా నామినేట్ చేయగా సెనేట్ అంగీకరించింది. 2012 వరకూ ఆ పదవిలో కొనసాగిన ఆయన ఆ తర్వాత గూగుల్ లో చేరారు. అరుణ్ మెకానికల్ ఇంజనీరింగ ప్రొఫెసర్ గా కూడా పని చేశారు.
600990 881223I view something genuinely special in this site . 254976
786798 925716A blog like yours ought to be earning significantly funds from adsense.~::- 200447