ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన ఏపీ ఉద్యోగుల జీతాలను 12 శాతం వడ్డీతో చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఆగస్టులో ఇందుకు సంబంధించిన అంశంలో 12 శాతం వడ్డీతో రెండు నెలల్లో జీతాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితి దెబ్బతినడంతో వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం పై ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం తరపున న్యాయవాది వినిపించిన వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. కరోనా సమయంలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగల జీతాలు, పెన్సన్ లను 50 శాతం చెల్లింపులు చేయాలని జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ మాజీ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనే ఆగష్టులో హైకోర్టు 12 శాతం వడ్డీ చెల్లించాని ఆదేశించింది.
497138 652564Hey there! Good post! Please when all could see a follow up! 861022
63448 849993Very informative post. Your current Site style is awesome as nicely! 973515