తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న విలువే వేరు. పెద్ద సంఖ్యలో లడ్డూలు పొందడం కోసం ఏకంగా సిఫార్సు లేఖలు కూడా తీసుకెళ్తుంటారు. అలాంటి లడ్డూ ఇకపై మరింత ప్రియం కానుంది. లడ్డూ ప్రసాదం ధరను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ రకాల దర్శనాలు చేసుకునే భక్తులకు ఒక్కో ధర నిర్ణయించి, ఆ మేరకు లడ్డూలు ఇస్తున్నారు.
కాలినడక భక్తులకు రూ.10కి ఒక లడ్డూ చొప్పున రెండు లడ్డూలు ఇస్తున్నారు. అలాగే సర్వ దర్శనం, టైంస్లాట్ భక్తులకు కూడా రూ.10కి ఒకటి చొప్పున రెండు లడ్డూలు.. అదనంగా రూ.25కి ఒక లడ్డూ చొప్పున మరో రెండు ఇస్తున్నారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే భక్తులకు రెండు లడ్డూలు ఉచితంగా, రూ.25కి ఒకటి చొప్పున మరో రెండు లడ్డూలు ఇస్తున్నారు. ఇకపై ఇవేవీ ఉండవు.
శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వనుంది. ఆపై ఎన్ని లడ్డూలు కావాలన్నా రూ.50కి ఒకటి చొప్పున కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. జనవరి 6న వైకుంఠ ఏకాదశి నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనుంది. వాస్తవానికి లడ్డూ ధరలపై భరిస్తున్న రాయితీని ఎత్తివేయాలని ఇటీవలే టీటీడీ భావించింది. లడ్డూ ధరను రూ.25 నుంచి రూ.50కి పెంచాలని అనుకుంది. అయితే, దీనిపై నిరసనలు వ్యక్తం కావడంతో అప్పట్లో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. తాజాగా ఉచిత లడ్డూ పేరుతో భక్తులపై బాదుడుకి తెర తీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నామని గొప్పగా చెబుతూ.. లడ్డూ ధరలు పెంచడంతో భక్తుల జేబులకు చిల్లు పడటం ఖాయమని అంటున్నారు. ప్రస్తుత విధానం ప్రకారం ఒక భక్తుడికి రూ.70కి నాలుగు లడ్డూలు వస్తుండగా.. ఇకపై అవే నాలుగు లడ్డూలకు రూ.150 చెల్లించాల్సిందే. ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో తీసుకోవడం అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుందన్నమాట. ఒక్కో లడ్డూ తయారీకి రూ.40 ఖర్చు అవుతోందని చెబుతున్న టీటీడీయే దాని ధరను రూ.50గా నిర్ణయించడం గమనార్హం.
251808 912926wonderful issues altogether, you merely gained a new reader. What could you recommend about your post that you created some days inside the past? Any positive? 624689