Viral video: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరి విపరీత పోకడలు చూస్తూనే ఉన్నాం. ఇలానే ఓ యువతి నడి రోడ్డు, ట్రాఫిక్ లో చేసిన విన్యాసం వైరల్ (Viral video) అయింది. దీనిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (V.C.Sajjanar) తప్పుబట్టారు. నడిరోడ్డుపై ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ.. సిగ్నల్ పడగానే బ్యాగ్ విసిసరేసి స్టెప్పులు వేస్తుంది. ఆటో, బస్సుల్లో జనం చూస్తూండగా నేలపై పడుకుని డ్యాన్స్ చేస్తుంది. నెట్టింట వైరల్ అయిన 23 సెకన్ల వీడియోను సజ్జనార్ సోషల్ మడియాలో పోస్ట్ చేశారు.
‘నేటి యువత ఇన్ స్టా రీల్స్ (Insta reels) , షార్ట్ పిచ్చిలో ఉండటం బాధాకరం. సమాజానికి పనికొచ్చే పనులు చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత సోషల్ మీడియా మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులారిటీ కోసం ఇటువంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యం కలిగించడం ఏం ఆనందమో ఏమో’ అంటూ రాసుకొచ్చారు. యువతి చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేటి యువతకు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023