వికారాబాద్ మర్పల్లి మండల కేంద్రం లో ఘోర ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో అందులో ఉన్న 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటూ స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు భయంకరంగా ఉందంటూ స్థానికులు చెబుతున్నారు. బస్సు ఫల్టీ కొట్టడంతో ఖచ్చితంగా పలువురు మృతి చెంది ఉంటారని భావించామని కాని అదృష్టవశాత్తు గాయాలే అయ్యాయి. ఇద్దరికి మాత్రం కాస్త సీరియస్ గా ఉందంటూ ఒక స్థానికుడు చెప్పుకొచ్చారు.
ప్రమాదం సమయంలో బస్సలో మొత్తంగా 60 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. అతి వేగంగా వెళ్తున్న డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలం అయ్యాడని ప్రమాదం నుండి బయట పడ్డ ప్రయాణికుల చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ యాక్సిడెంట్ తో మరోసారి ఆర్టీసీ ప్రయాణం పై ఉన్న నమ్మకం తగ్గిందంటూ జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు అలసత్వంతో వ్యవహరించడం సరైనది కాదని ప్రజలు అంటున్నారు.
898059 219878This web site is in fact a walk-through it truly could be the info you desired relating to this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 803360