హైద్రాబాద్లో రెండు రైళ్ళు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణీకులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఓ ఎంఎంటీఎస్, ఓ ఎక్స్ప్రెస్ రైలుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ మీద రెండు రైళ్ళు ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణం. రైలు డ్రైవర్ సిగ్నల్ని పరిశీలించలేదా.? ఇది సాంకేతిక తప్పిదమా.? రైల్వే వ్యవస్థ లోపమా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఎంఎంటీఎస్ని నడుపుతున్న లోకో పైలట్, ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయారు. అతన్ని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోకో పైలట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో రెండు రైళ్ళలో కలిపి 600 మందికి పైగా ప్రయాణీకులు వున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు రైళ్ళలోని ప్రయాణీకులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే, ప్రమాదం కాచిగూడ రైల్వే స్టేషన్కి సమీపంలో జరగడంతో హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టడానికి వీలయ్యింది. కర్నూలు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, ఎంఎంటీఎస్ ఒకే ట్రాక్పైకి రావడంతో ప్రమాదం జరిగిందనీ, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
84065 69634We will supply deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to shed. 886586
668646 722336Whoah this weblog is magnificent i truly like reading your articles. Keep up the great paintings! You realize, lots of persons are searching round for this data, you could aid them greatly. 390163
443123 263343Several thanks for sharing this fine piece. Extremely intriguing concepts! (as always, btw) 420747