సాదారణంగా ఒక ప్రాంతంలో పిడుగు పడినది ఇద్దరు లేదా ముగ్గురు చనిపోయారు అంటూ చాలా సార్లు మీడియాలో వార్తలు చూశాం. కాని ఈసారి మాత్రం విభిన్నం. ఒకే రోజులో బీహార్ రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 83 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు ఎప్పుడు నమోదు కాలేదు అంటూ వాతావరణ శాఖ వారు సైతం ఆశ్చర్య పోతున్నారు.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల పలు చోట్ల ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక చోట్ల పిడుగులు పడ్డాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. గోపాల్గంజ్ జిల్లాలో అత్యధికంగా పిడుగు పాటుకు 13 మంది మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇతర జిల్లాలో ఒక్కరు ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో పిడుగు పాటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లుగా ప్రకటించింది. ఇలా ఎందుకు జరిగిందే విషయమై వాతావరణ శాఖ అధికారులు చర్చిస్తున్నారు.
945316 497440It is really a cool and helpful piece of details. Im glad that you shared this beneficial information with us. Please maintain us informed like this. Thanks for sharing. 172755