Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి భారత దేశ రెండో అత్యున్నత పురష్కారం అయిన పద్మ విభూషన్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. సేవా మరియు సినీ రంగంలో చిరంజీవి అందించిన సేవకు గాను ఈ అత్యున్నత పురష్కారం దక్కింది.
చిరంజీవికి పద్మ విభూషన్ అవార్డు అందినప్పటి నుంచి సినీ మరియు రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఆయన వద్దకు వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఘన సన్మానం దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.
రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు శిల్ప కళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగా సన్మానం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అందుతోంది.
మరో వైపు ఇటీవలే విశ్వంభర సినిమా షూటింగ్ లో చిరంజీవి జాయిన్ అయ్యాడు. 2025 సంక్రాంతికి విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. సోషియో ఫాంటసీ కథాంశంతో చిరంజీవి హీరోగా వషిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా రూపొందబోతుంది.