వైద్యవృత్తిలో తనకు విశేష అనుభవం ఉందని.. వైద్యురాలిగా వైద్యవృత్తిలో పొందిన ధైర్యంతోనే తాను గవర్నర్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గైనకాలజిస్టుగా ఎందరో శిశువులకు చికిత్స అందించానని అన్నారు. తనను గవర్నర్ గా నియమిస్తే చాలా విమర్శలు వచ్చాయని.. అయినా తాను ధైర్యంగా ముందుకెళ్తున్నానని అన్నారు.
మాతృదినోత్సవం సందర్భంగా మహిళలు, చిన్నారుల సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్నారు. వైద్యానికి సంబంధించిన అంశాలపై తనను సంప్రదించొచ్చని అన్నారు. మరోవైపు.. రాజ్ భవన్ లో జరిగిన రెడ్ క్రాస్ డే వేడుకల్లో కూడా గవర్నర్ పాల్గొన్నారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ అద్భుతమైన సేవలు అందించిందని కొనియాడారు. తలసేమియాపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ జిల్లాల్లో కూడా బ్లడ్ బ్యాంక్, క్లినిక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
182597 821383As I site owner I conceive the content material here is rattling outstanding , thanks for your efforts. 28073
525403 855347Hello! Good post! Please do maintain us posted when we can see a follow up! 529052
258162 117181I like this web internet site really much, Its a genuinely good post to read and get info . 959149