జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కౌలు రైతు భరోయా యాత్రలో ఆయన పాల్గొన్నారు. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సుబ్బారాయుడు ఆత్మహత్యకు గల కారణాలను రైతు భార్య భూలక్ష్మిని అడిగి తెలుసుకుని ఆమెను ఓదార్చారు. అనంతరం.. ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఆర్ధికసాయం, భరోసా గురించి తెలుసుకున్నారు. పార్టీ తరపు నుంచి లక్ష చెక్కును ఆర్ధికసాయంగా అందించారు. ఆమె బిడ్డలకు అండగా జనసేన ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా సుబ్బారాయుడి భార్య భూలక్ష్మి మాట్లాడుతూ.. భర్త మరణానంతరం ఆర్ధికసాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏడాదిగా తిరిగినా ఫలితం దక్కలేదని అన్నారు. పవన్ కల్యాణ్ అందించిన సాయం తమకెంతో ధైర్యాన్నిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు వచ్చిన పవన్ కల్యాణ్ కు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికి.. భారీ ర్యాలీ నిర్వహించారు.
*కౌలు రైతు శ్రీ చిన్న హుస్సేనీ కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మరో కౌలు రైతు శ్రీ దూదేకుల పండ్లాపురం చిన్న హుస్సేనీ కుటుంబానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం అందచేశారు#JanaSenaRythuBharosaYatra – Kurnool pic.twitter.com/twlAfSDqop
— JanaSena Party (@JanaSenaParty) May 8, 2022
743238 761827Wow i like yur site. It genuinely helped me with the information i wus searching for. Appcriciate it, will bookmark. 487291