తెలంగాణ లో లాక్ డౌన్ అవసరం లేదని.. భవిష్యత్తులో అవసరం వస్తుందని కూడా అనుకోవడం లేదని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుంటూ వీకెండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. లాక్ డౌన్ కంటే రాష్ట్ర ప్రజలకు సరైన వైద్య సదుపాయం అందించడంపై దృష్టి పెడుతున్నామన్నారు.
ప్రస్తుత పరిస్థితులపై లాక్ డౌన్ పెట్టినా పెద్దగా ఉపయోగం లేదని అన్నారు. ఇతర రాష్ట్రాలు వారి పరిస్థితులకు తగ్గట్టు లాక్ డౌన్ పెట్టుకున్నాయన్నారు. తెలంగాణలో పరిస్థితులు కంట్రోల్ లోనే ఉందన్నారు. ప్రజలకు కరోనా లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేస్తామన్నారు. వారికి మెడికల్ కిట్స్ ను కూడా ఇంటికే పంపిస్తామన్నారు. ప్రజల ఉపాధి విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు.
403092 673424Fantastic post nevertheless , I was wanting to know if you could write a litte a lot more on this subject? Id be extremely thankful should you could elaborate a little bit further. Bless you! 260727