Bihar: బీహార్ (Bihar) లో ముగ్గురు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్ధుల ముందే కొట్టుకోవడం సంచలనం రేపింది. చెప్పుతో కొట్టి, జుట్టు పట్టుకుని, కిందపడి కొట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
పట్నా (Patna) లోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్లో కిటికీ తలుపులు మూయమన్న ప్రధానోపాధ్యాయురాలితో ఇద్దరు ఉపాధ్యాయులు ఘర్షణ పడ్డారు. తరగతి గదిలోకి వచ్చిన ప్రధానాపాధ్యాయురాలు టీచర్ ను కిటీకీ మూయమన్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు గది నుంచి బయటకు వస్తుంటే ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో ఆమె వెనుక నుంచి దాడి చేసింది.
వెంటనే మరో ఉపాధ్యాయురాలు కూడా వచ్చి ప్రధానోపాధ్యాయురాలని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి కిందపడి కొట్టుకున్నారు. పొలాల్లోని కూలీలు వచ్చి వారిని విడదీశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వీరికి వ్యక్తిగత విబేధాలున్నాయని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి అన్నారు. విచారణ జరుపుతున్నామని.. ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
https://twitter.com/sarveshmediaman/status/1661714212572508161?s=20