Margadarsi: మార్గదర్శి (Margadarsi) కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. మంగళవారం విచారణకు వచ్చిన పిటిషన్ పై కీలక తీర్పును వెలువరించింది. మార్గదర్శి సేకరించిన డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలని.. నిజాలు వెలుగులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టుకు కేసును రిఫర్ చేసింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. పబ్లిక్ నోటీసు ఇవ్వాలని ఇంకా డిపాజిటర్లకు నగదు ఇవ్వాల్సి ఉందా..? లేదా అనేది హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించి రెండు, మూడు నెలల్లో సమగ్ర విచారణ జరపాలని.. ఆర్బీఐ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆదేశించింది.
ఆరు నెలల్లో తెలంగాణ హైకోర్టు కేసు విచారణ పూర్తి చేయాలని.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ, పిటిషనర్ ఉండవల్లి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై ఉండవల్లి హర్షం వ్యక్తం చేశారు. 17ఏళ్ల మా వాదన నిజమని తేలిందని అన్నారు.