లఖ్ నవూ, వారణాసి, ప్రయాగ్ రాజ్, కాన్పూర్,చ గోరఖ్ పూర్ నగరాల్లో ఏప్రిల్ 26 వరకూ లాక్ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. లాక్ డౌన్ విధించే అంశం హైకోర్టు పరధిలో లేదని పిటిషన్ దాఖలు చేసింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు ఉత్తర్వులు పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది.
వాదనలు విన్న జస్టిస్ బోబ్డే ధర్మాసనం.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారం రోజుల్లోగా కోర్టుకు విన్నవించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ సీనియర్ న్యాయవాది సీఎస్ నరసింహను అమికస్ క్యూరీగా నియమించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు యూపీలో వీకెండ్ లాక్ డౌన్ అమలవుతోంది. శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర, నిత్యావసరాల సేవలకు మాత్రమే అనుమతి అని సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రకటించారు.
888696 430374Definitely pent topic matter, appreciate it for selective details . 40871