ఈ ఏడాది విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలంగా ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మొత్తం వృదా కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఒకొక్కరికి 11 వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం వారి అకౌంట్ లో లేదా వారి తల్లిదండ్రుల అకౌంట్ లో వేసేందుకు సిద్దం అయ్యింది అంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో మరియు ప్రముఖ వెబ్ మీడియాల్లో కూడా వార్తలు వచ్చాయి.
సోషల్ మీడియాలో ప్రచారంతో చాలా మంది విద్యార్థులు ఆ డబ్బులు ఎలా వస్తాయా అంటూ నెట్టింట వెదకడం మొదలు పెట్టారు. ఎలా అందుకు అప్లై చేయాలా అంటూ ఎదురు చూస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే మీడియాలో ప్రచారం జరుగుతున్నది పూర్తిగా అవాస్తవం.
అసలు అలాంటి ఆలోచన కేంద్రంకు లేదు. ఇప్పటి వరకు ఎవరికి కూడా నగదు బదిలి విషయమై నిర్ణయం తీసుకోలేదు. మీడియాలో వస్తున్న వార్తలను ఫ్యాక్ట్ ఫైడింగ్ వారు కొట్టి పారేశారు. ఇలాంటి వార్తలు పుట్టించినందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దం అవుతున్నారు.
330636 176588Thanks for helping out, exceptional information. 490810