ఛతీస్గడ్ లో మరోసారి మావోలు రెచ్చి పోయారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోక వచ్చే కుర్చేలి, మోటాపాల్ గ్రామాలకు చెందిన 25 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వారితో ప్రజా కోర్టు నిర్వహించి అందులో నలుగురిని పీక కోసి చంపేశారు. వారు మావోయిస్టు ఉద్యమంకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు వారి వల్ల ఉద్యమం దెబ్బ తిన్నట్లుగా నిరూపితం అయ్యిందని సమాచారం. ఈ విషయమై అటు పోలీసులు ఇటు మావోలు ఎవరు కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు నలుగురిని చంపేసినట్లుగా మాత్రం తెలుస్తోంది.
25 మందిలో ఇప్పటి వరకు నలుగురిని చంపేయగా ఐదుగురిని వెనక్కు పంపించారు. వారు తిరిగి వచ్చి విషయం పోలీసుల వద్ద చెప్పారు. మిగిలిన 16 మందిని మావోలు ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. విడుతల వారిగా వారిని విడిచి పెట్టే ఉద్దేశ్యంతో మావోలు ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులు నోరు మెదపక పోవడంపై గ్రామస్తులు మరియు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
596364 85212As I web-site possessor I believe the content matter here is rattling wonderful , appreciate it for your efforts. You ought to maintain it up forever! Very best of luck. 18797