కరోనా కమ్మేస్తున్న వేళ రియల్ హీరో సోనూసూద్ చేస్తున్న సాయం తెలిసిందే. ఆయన స్ఫూర్తితో ఏర్పాటైన ఆయన టీం ఈరోజు 22 మంది ప్రాణాలు కాపాడింది. బెంగళూరులోని అరక్ ఆరసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో వెంటనే అలెర్టయిన సత్యనారాయణన్ అనే పోలీసు అధికారి ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ సోనూసూద్ టీమ్ కు మెసేజ్ పంపించాడు. వెంటనే స్పందించిన టీమ్ హుటాహుటిన ఆసుపత్రికి 16 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు.
దీంతో వారందరికీ ఆక్సిజన్ అందించి వారిని కాపాడారు. అప్పటికే ఇద్దరు చనిపోయారు కూడా. వాలంటీర్ల సేవను తెలుసుకున్న సోనూసూద్ వారిని అభినందించారు. ‘మా టీమ్ స్పందనకు గర్వంగా ఉంది. మా టీమ్ వర్క్ కు ఇది నిదర్శనం. ఇన్ స్పెక్టర్ సత్యనారాయణన్ నుంచి మెసేజ్ రాగానే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచి ఎందరో కుటుంబాలను ఆదుకున్నాం. ఇకపై దేశ ప్రజలను ఇలానే ఆదుకుంటాం. వారికి నా ధన్యవాదాలు’ అని ఓ ప్రకటనలో తెలిపారు.