సంగం డెయిరీలో అవకతవకలకు సంబంధించిన కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు జ్వరం, జలుబు లక్షణాలు ఉండటంతో ఇటివల ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు కూడా. ఈమేరకు ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించాలని.. చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆయనకు కరోనా సోకడంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
37009 321742Soon after study a couple of of the blog posts on your personal web site now, we truly like your way of blogging. I bookmarked it to my bookmark internet internet site list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware in case you agree. 625355