ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ఓ విన్నపం చేశారు. కొవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలవాలని.. వీలైనంతగా సాయం అందించాలని కోరారు. ఈమేరకు ట్వీట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. ‘దేశంలో కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్నారు. దీంతో వారి పిల్లలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోంది. 8 నుంచి 12 ఏళ్ల వయస్సున్న ఎంతోమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కరోనా కారణంగా కోల్పోతున్నార’.
‘వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంటోంది. కాబట్టి ఆ చిన్నారులకు అండగా నిలవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలను కోరుతున్నాను. వారికి స్కూల్ నుంచి కళాశాల వరకూ ఉచిత విద్య అందించాలని అభ్యర్థిస్తున్నాను’ అని సోనూసూద్ ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. గతేడాది కరోనా సమయం నుంచి సోనూసూద్ విరివిగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.
पूरे देश को मिल के इस मुहिम में जुड़ना है। @EduMinOfIndia pic.twitter.com/ei9QJYtDcF
— sonu sood (@SonuSood) April 29, 2021
906632 70263Outstanding post, I feel weblog owners should larn a whole lot from this weblog its actually user genial . 548369
979241 902956To know wisdom and instruction, to perceive the words of understanding 27387
746594 364013I took a break to view your post. I discovered it quite relaxing 588865