Switch to English

చిరంజీవితో సోము వీర్రాజు ‘మెగా’ మీటింగ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్‌ చిరంజీవితో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. రాజకీయాల్లో ఇప్పుడీ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. చిరంజీవిని సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ వర్గాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే, ఈ మీటింగ్‌ వెనుక పెద్ద పొలిటికల్‌ స్కెచ్‌ వుందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుండడం గమనార్హం.

మెగాస్టార్‌ చిరంజీవిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, చిరంజీవి మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా వున్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు ఎంపికవడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి అవడం తెలిసిన విషయాలే. బీజేపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్‌ చేసినట్లు గతంలోనే ఊహాగానాలు విన్పించాయి.

ఇదిలా వుంటే, చిరంజీవి తన సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ కోసం పనిచేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. అయినా, చిరంజీవి రాజకీయాలకు దూరంగానే వున్నారు. రాజకీయాలకు దూరంగా వున్నా, చిరంజీవి చుట్టూ ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తుండడం గమనార్హం. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజుకి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారట. జనసేన పార్టీతో కలిసి బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించిన చిరంజీవి, 2024 ఎన్నికల్లో జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించినట్లు మీడియాలో వార్తా కథనాలు దర్శనమిస్తున్నాయి.

మరోపక్క సోము వీర్రాజు – చిరంజీవి భేటీ పట్ల ఇటు టీడీపీ అటు వైసీపీ శ్రేణుల్లో ఒకింత అలజడి కన్పిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ మద్దతుదారులు అప్పుడే చిరంజీవిపైనా, పవన్‌ కళ్యాణ్‌పైనా, జనసేన, బీజేపీపైనా ట్రోలింగ్‌ షురూ చేసేశారు. మొత్తమ్మీద, సోము వీర్రాజు మర్యాదపూర్వకంగానే అయినా చిరంజీవితో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ఓ మోస్తరు ప్రకంపనలకు కారణమవుతోందన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...