సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి ఆరు అంతస్థుల భవనం పూర్తిగా దెబ్బతింది. దాదాపు 12గంటలకు పైగా అగ్నికీలల ఉధృతి కొనసాగడంతో ఎవరూ లోపలికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. భవనంలో బీహార్ కు చెందిన ముగ్గురు కూలీలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ భవనంలోనే చూపిస్తూండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇదే జరిగితే వారు సజీవ దహనమై ఉంటారని పోలీసులు అంటున్నారు. వారి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు.. మంటలకు పూర్తిగా దెబ్బతినడంతో భవనం కూల్చివేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. సహాయక చర్యల్లో భాగంగా అస్వస్థతకు గురైన ఇద్దరు ఫైర్ సిబ్బందిలో ఒకరు చికిత్స పొందుతూండగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. భవనంతోపాటు చుట్టుపక్క ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు.
158101 398487Absolutely nothing much better than Bing locating us a good internet site related to what I was seeking for. 286366
74021 102905This is such an excellent post, and was thinking much the same myself. Another wonderful update. 456561
851022 93479I like this weblog so a lot, saved to bookmarks . 191130